ఉద్యోగుల జీపీఎస్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసలు

5 Oct, 2023 04:13 IST|Sakshi

2004 పెన్షన్‌ సంస్కరణలను కాపాడుతూనే జీపీఎస్‌ తెచ్చిన ఏపీ

ఉద్యోగులకు 50% పెన్షన్‌ గ్యారెంటీ

డీఆర్, ఉద్యోగుల హెల్త్‌ స్కీం జీపీఎస్‌లో అదనం

పాత పెన్షన్‌ స్కీముకు వెళితే భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి

జీతాలూ చెల్లించలేక మొదటికే మోసం

అందుకే లోతుగా అధ్యయనం చేసి ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్‌

ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఆంగ్ల పత్రిక మింట్‌ బ్యానర్‌ కథనం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానిపై లోతుగా అధ్యయనం చేస్తారు. నిబంధనలను అను­స­రిస్తూనే, లబ్ధిదారులకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేసేలా దానిని రూపొందిస్తారు. ఇటువంటిదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఆంధ్ర­ప్రదేశ్‌ గవర్నమెంట్‌ పెన్షన్‌ స్కీము (ఏపీజీపీఎస్‌).

కేంద్ర ప్రభుత్వం 2004లో చేసిన పింఛను సంస్కర­ణలను కాపాడుతూనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేసేలా ఆంధ్రఫ్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తు­తు­న్నాయి. జాతీయ స్థాయి పత్రికలు కూడా వైఎస్‌ జగన్‌ తెచ్చిన జీపీఎస్‌ను మంచి పథకంగా అభివర్ణి­స్తు­న్నాయి. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘మింట్‌’ బ్యానర్‌ కథనమే ప్రచురించింది.

ఏపీజీపీఎస్‌ పింఛను సంస్కరణలను ఎలా కాపాడుతోందో ఈ కథ­నం వివరించింది. పదవీ విరమణ చేసిన తరువాత చి­వరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పింఛను వచ్చేలా ఉద్యోగులకు ఏపీజీపీఎస్‌ ద్వారా గ్యారెంటీ కల్పిస్తూనే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం పడకుండా సరికొత్త సంస్కరణలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిందని మింట్‌ పత్రిక ప్రశంసించింది.

వివేచనతో వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం
పాత పింఛను పథకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభు­త్వాలపై భవిష్యత్‌లో మోయలేని ఆర్థిక భారం పడు­తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పెన్షన్‌ స్కీము ద్వారా పింఛను సంస్కర­ణలు తెచ్చింది. మెజారిటీ రాష్ట్రాలు కూడా 2004 నుంచి జాతీయ పెన్షన్‌ స్కీమును అమలు చేస్తు­న్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ జాతీయ పెన్షన్‌ స్కీము అమలు చేస్తున్నారు. దీనినే ఎంప్లాయీస్‌ కంట్రిబ్యూ­టరీ పెన్షన్‌ స్కీముగా (సీపీఎస్‌) కూడా పేర్కొంటారు. ఇందులో పింఛను ఎంత వస్తుందనేది మార్కెట్‌ పరిస్థితులనుబట్టి ఉంటుంది.

కచ్చి­తంగా ఎంత వస్తుందో చెప్పలేని పరి­స్థితి. ఈ నేప­థ్యంలో ఉద్యోగులు పాత పెన్షన్‌ స్కీము అమలు చేయా­లని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం వీటిపై లోతుగా అధ్య­యనం చేసింది. భవిష్యత్‌ తరాల ప్రయో­జనాలను దృష్టిలో పెట్టుకుని, పెన్షన్‌ సంస్కరణలపై రాజీపడ­కుండా మధ్యే మార్గంగా ఏపీ­జీపీఎస్‌ను తీసుకువ­చ్చిందని మింట్‌ పత్రిక ప్రశంసించింది. ఒక వేళ భవిష్యత్‌ తరాల గురించి ఆలో­చన చేయకుండా పాత పింఛను పథకాన్నే అమలు చేస్తే పదేళ్ల తరువాత ఉద్యోగులకు జీతభ­త్యా­లిచ్చే పరిస్థితి కూడా ఉండదని, మొదటికే మోసం వస్తుందని తెలిపింది.

రాజకీయం కోసం ఆలోచన చేయ­కుండా భవిష్యత్‌ తరాల కోసం, ఉద్యోగుల డిమాండ్‌లో కూడా న్యాయం ఉందని భావించి సుదీర్ఘ కసరత్తు చేయడంతోపాటు వివేచనతో ఏపీ ప్రభు­త్వం వ్యవహరించింది. ఇటు ఉద్యోగులకు పెన్షన్‌ గ్యారెంటీ ఇస్తూనే,  మరోపక్క రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపో­కుండా  ఏపీజీపీ­ఎస్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో అమ­లుకు నిర్ణ­యం తీసుకుంది. తద్వారా 2004 పెన్షన్‌ సంస్కరణ­లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాపాడింది. పాత పింఛను స్కీమును అమలు చేస్తే 2041 కల్లా అప్పు కూడా పుట్టని దశకు రాష్ట్రం చేరుతుంది. అంతే కాకుండా 2050కల్లా ద్రవ్యలోటు 8 శాతానికి చేరుతుంది.

ఇవీ పింఛను స్కీములు
పాత పింఛను విధానంపాత పెన్షన్‌ స్కీము అమలు చేయడం కేంద్రంపైన, రాష్ట్రాలపైన ఆర్థికంగా పెనుభారం పడుతుంది. దీన్ని భవిష్యత్‌లో కొనసాగించ­డం సాధ్యం కాదు. పెన్షన్ల భారం 4.5 రెట్లు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో జీతభ­త్యా­లు కూడా ఇవ్వలేనంతగా భారం అవుతు­ంది.

2004లో తెచ్చిన జాతీయ పింఛను పథకం
జాతీయ పెన్షన్‌ స్కీము కింద ఉద్యోగులకు వచ్చే పెన్షన్‌ పరిమాణాన్ని మార్కెట్‌ పరిస్థి­తు­లు నిర్ణయిస్తాయి. ఎంత పెన్షన్‌ వస్తుంద­నేది కచ్చితంగా చెప్పలేరు. అయితే ఈ స్కీము రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ­జీపీ­ఎస్‌ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన తరు­వాత చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగ­స్వామికి ఆ పెన్షనలో 60 శాతం వస్తుంది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్‌ వస్తుంది. హెల్త్‌ స్కీము కూడా వర్తిస్తుంది.

మరిన్ని వార్తలు