మదనపల్లె సిటీ: మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా కె. ప్రమీలను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈమె సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా రానున్నారు. మదనపల్లె మున్సిపల్ కమిషనర్గా పని చేస్తున్న రఘనాథరెడ్డి కర్నూలు జిల్లా ఆదోనికి బదిలీ అయ్యారు.