ఒకే కుటుంబంలో ముగ్గురికి పీహెచ్‌డీలు 

11 Sep, 2023 03:59 IST|Sakshi

ఏయూ స్నాతకోత్సవంలో అందజేసిన వీసీ 

గూడెంకొత్తవీధి: వారిది సామాన్య మధ్యతర­గతి కుటుంబం..ఉన్నత చదువులు చదవాల­న్న సంకల్పం.. పట్టుదల.. వారి కలలను సా­కా­రం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టరేట్‌ లభించింది. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో జరిగిన 87–90 స్నాతకోత్సవాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని సీలేరుకు చెందిన గసాడి శాంతి, ఆమె భర్త సత్యవర ప్రసాద్, అతని సోదరుడు ఆనంద్‌ లు ఏయూ వీసీ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.

ప్రస్తుతం సీలేరు మహిళా పోలీసుగా పనిచేస్తోన్న గసాడి శాంతి 2013–18 మధ్య సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రొఫెసర్‌ ప్రేమానందం సారథ్యంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈమె భర్త సత్య వరప్రసాద్, అతని సోదరుడు ఆనంద్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పొలిటికల్‌ ప్రొఫెసర్‌ జాలాజీ రవి సారథ్యంలో పూర్తి చేశారు.   

మరిన్ని వార్తలు