‘ఏపీఎస్‌డీఎం’కి విర్కో గ్రూప్‌ కంపెనీ భారీ విరాళం

10 Jan, 2022 19:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విర్కో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ ఎం.మహా విష్ణు అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..

మరిన్ని వార్తలు