సుప్రీం కోర్టులో నేడు వివేకా కేసు పిటిషన్‌పై విచారణ

27 Mar, 2023 07:54 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు(మార్చి 27, సోమవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య  తులసమ్మ  దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది కోర్టు. 

సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ వేశారు తులసమ్మ. గతంలో ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది.  ఈ మేరకు కేసు  పురోగతిపై సీల్డ్‌ కవర్‌లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని  సీబీఐని ఆదేశించించింది కూడా.

మరిన్ని వార్తలు