రుషికొండ తీరంలో వేల్‌షార్క్‌ సందడి

9 Feb, 2022 10:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అతి పెద్ద చేపగా పిలిచే వేల్‌షార్క్‌ మరోసారి విశాఖలో సందడి చేసింది. ఇటీవల తంతడి వద్ద మత్స్యకారుల వలకు చిక్కగా.. దానికి వైద్యం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపించారు. తాజాగా రుషికొండ తీరంలో ఈ అరుదైన వేల్‌షార్క్‌ కనిపించింది. లివిన్‌ అడ్వెంచర్స్‌ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు తీరం నుంచి 2 కి.మీ. దూరంలో విహరించి.. బోటులో తిరిగి వస్తుండగా.. ఈ చుక్కల వేల్‌షార్క్‌ సందడి చేసింది.

సుమారు 7 మీటర్ల పొడవుందని సంస్థ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ తరహా వేల్‌షార్క్‌లు రుషికొండ తీరంలో కనిపించడం మొట్టమొదటిసారి అని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు