మంగళగిరి: సాక్షి దినపత్రికలో బుథవారం ప్రచురితమైన ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ పనితీరు వివాదాస్పదం కథనం నగరంలో సంచలనం సృష్టించగా పోలీస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఉదయం నుంచే పోలీస్ వర్గాల్లో చర్చ సాగింది. స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ కథనంపై ఆరా తీశారు. ఏఎస్ఐ పనితీరు, గత ఎన్నికల్లో తన గురువు అయిన మాజీ రామాంజనేయులు సహకారంతో లోకేష్ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కృషి చేశారని, మళ్లీ ఈ ఎన్నికల్లోనూ లోకేష్ గెలుపుకోసం పని చేస్తున్నాడని తెలుసుకున్న అధికారులు విస్మయానికి గురయ్యారు. తొలినుంచి వివాదాస్పదుడైన సదరు ఏఎస్ఐపై వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టారు. ఏఎస్ఐపై వేటు ఖాయమంటూ పలువురు అధికారులు చర్చించుకోవడం గమనార్హం.