ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌

23 Dec, 2023 08:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీసులందించే ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ తాజాగా ఎకో హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది.

 ఈజ్‌మైట్రిప్‌ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్‌ షేరుకి ఒక ఈజీ ట్రిప్‌ షేరుని కేటాయించనుంది.

 ఆపై ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్‌ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈజ్‌మైట్రిప్‌ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. 

>
మరిన్ని వార్తలు