ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్‌’ గోపీనాథన్‌

2 Dec, 2023 06:37 IST|Sakshi

ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజే­శ్‌ గోపీనాథన్‌ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండి­యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది.

’ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌’ హోదాలో గోపీనాథన్‌ ఈ సెంటర్‌ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్‌–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్‌ గోపీనాథన్‌ టీసీఎస్‌ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు