ఐటీ పోర్టల్‌ సమస్యల పరిష్కారంలో పురోగమనం

9 Sep, 2021 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్‌ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్‌ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్‌ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్‌ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్‌ జూన్‌ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు