మారుతి కార్ల ధరలకు రెక్కలు

23 Mar, 2021 08:20 IST|Sakshi

మెర్సిడిస్‌ బెంజ్‌ సిల్వర్‌స్టార్‌ ఆవిష్కరణ 

మారుతి ధరల పెంపు

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ ఏప్రిల్‌ నుంచి తన అన్ని రకాల కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగటంతో ధరల్ని పెంచక తప్పడం లేదని కంపెనీ చెప్పుకొచ్చింది. అయితే ఏ మోడల్‌ ఎంత ధర పెరుగుతుందో అనే అంశాన్ని వెల్లడించలేదు. ఇప్పటికే మారుతీ ఈ ఏడాది జనవరిలో కొన్ని కార్ల ధరలను  రూ. 34 వేల వరకు పెంచింది. 

మూడు స్టార్టప్‌ల ఎంపిక.
మొబిలిటీ, ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (మెయిల్‌) ప్రోగ్రాం కింద 3 కొత్త స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు మారుతీ తెలిపింది. నేబుల్‌ ఐటీ, రెడ్‌బాట్, స్లీవ్‌ వీటిలో ఉన్నాయి. ఇవి ఇకపై పెయిడ్‌ ప్రాజెక్టుల్లో భాగం కావచ్చని మారుతీ ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. 

ఫిబ్రవరిలో మారుతి సుజుకి 168,180 వాహనాలను ఉత్పత్తి చేసింది, అంతకు ముందు ఏడాది 140,933 యూనిట్లు. ఇందులో 165,783 ప్యాసింజర్ వాహనాలు, 2,397 లైట్ కమర్షియల్ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.ఇక అమ్మకాల విషయానికొస్తే, కంపెనీ 2021 ఫిబ్రవరిలో 164,469 యూనిట్లను విక్రయించింది, లేదా గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.8 శాతం ఎక్కువ. గత నెలలో 144,761 ప్యాసింజర్ వాహనాలు, 2,722 తేలికపాటి వాణిజ్య వాహనాలు, 5,500 వాహనాలు ఇతర OEM లకు విక్రయించబడ్డాయి మరియు 11,486 ఎగుమతి చేసిన యూనిట్లు ఉన్నాయి. అయితే, 2020-21 ఏప్రిల్-ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలు 12.8 శాతం తగ్గి 1,290,847 యూనిట్లకు చేరుకున్నాయి.

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సరికొత్త ‘ఈక్లాస్‌’ మెర్సిడీస్‌ బెంజ్‌ సిల్వర్‌స్టార్‌ని లాంచ్‌ చేశారు. ఈ సిల్వర్‌ స్టార్‌ని బంజారాహిల్స్‌లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో సీఈఓ మహేష్‌ దేవ్, సేల్స్‌ లీడ్‌ సాయిహార్ష కలిసి ఆవిష్కరించారు. ఈ మోడల్‌లో ఆధునిక సాంకేతను ఉపయోగించి వినూత్నంగా ఎమ్‌బీయూఎక్స్‌ సిస్టమ్, ట్విన్‌ డిజిటల్‌ టచ్‌ స్క్రీన్, హే మెర్సిడీస్‌ వాయిస్‌ కమాండ్స్‌తో రూపొందించామని వారు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు