ల్యాప్‌టాప్‌ల దిగుమతికి లైసెన్స్‌ అవసరం లేదు

14 Oct, 2023 09:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్‌ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్‌వాల్‌ వెల్లడించారు.

ల్యాప్‌టాప్స్, టాబ్లెట్‌ పీసీలు, కంప్యూటర్లను నవంబర్‌ 1 నుండి లైసెన్సింగ్‌ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య లు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దిగుమతిదారులను నిశితంగా గమనిస్తామని, తద్వారా దిగుమతులను పర్యవేక్షించవచ్చన్నారు. 
 

మరిన్ని వార్తలు