స్థిరంగా పసిడి.. స్వల్పంగా పెరిగిన వెండి - నేటి ధరలు ఇలా

23 Nov, 2023 13:47 IST|Sakshi

గత కొన్ని రోజులుగా పడుతూ.. లేస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ సీజన్ తరువాత భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం కొంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపిస్తాయి. నేడు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5685, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6102గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56850, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 61020గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5740 (22 క్యారెట్స్), రూ. 6260 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57400, రూ. 62600గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: చిన్న గదిలో మొదలైన వ్యాపారం.. నేడు రూ.4000 కోట్ల సామ్రాజ్యంగా..!!

ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5700, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6217గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57000 (22 క్యారెట్స్), రూ. 62170కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు రూ. 200 పెరిగింది.

మరిన్ని వార్తలు