సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

23 Nov, 2023 08:48 IST|Sakshi

నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయంలో నేడు సెన్సెక్స్ 108.98 పాయింట్ల లాభంతో 66132.22 వద్ద, నిఫ్టీ 35.20 పాయింట్ల లాభంతో 19847.00 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా ఈ రోజు లాభాల్లోనే ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అదానీ పోర్ట్స్ కంపెనీలు చేరగా.. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు నష్టాల్లో సాగుతున్నాయి. ఈ రోజు ఆటోమొబైల్ సెక్టార్ కొంత ఊపందుకున్నట్లు తెలుస్తోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు