స్థిరంగా బంగారం.. రూ.500 తగ్గిన వెండి - కొత్త ధరలు ఇలా!

18 Nov, 2023 12:02 IST|Sakshi

దీపావళి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5655, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6169గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 56550, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 61690గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5700 (22 క్యారెట్స్), రూ. 6218 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 57000, రూ. 62180గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

ఢిల్లీలో ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5670, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6179గా ఉంది. నిన్న ధరలే ఈ రోజూ కొనసాగుతాయి, కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56700 (22 క్యారెట్స్), రూ. 61790కి (24 క్యారెట్స్) చేరింది. వెండి ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో రూ. 500 తగ్గుముఖం పట్టింది.

మరిన్ని వార్తలు