సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీ స్టాక్‌ సూచీలు

13 Nov, 2023 08:43 IST|Sakshi

దీపావళి సెంటిమెంట్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కలిస్తాయని మార్కెట్‌ నిపుణులు భావించారు. కానీ అన్యూహ్యంగా స్టాక్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

సోమవారం ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 278 పాయింట్లు నష్టపోయి 64980 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 19450 వద్ద కొనసాగుతున్నాయి.  

ఎథేర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ ఇండ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ, గ్రాసిమ్‌, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు