నల్గొండ: ఐదుగుర్ని బలిగొన్న నిద్రమత్తు!

4 Sep, 2020 07:44 IST|Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వాటర్‌ పైపులైన్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున చింతపల్లి మండలం, ధైర్యపురి తండా సాగర్‌హైవేపై  ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌నుంచి మల్లెపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 5 గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 


చదవండి : ప్రాణాలు తీసిన అతివేగం

మరిన్ని వార్తలు