షాకింగ్‌ ఘటన.. క్లాస్‌రూంలో బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం

3 Dec, 2022 07:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై(మహారాష్ట్ర): తరగతి గదిలో ఒంటరిగా ఉన్న 8వ తరగతి బాలికపై ఇద్దరు సహ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ముంబైలోని మాతుంగ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది.

తోటి వారంతా డ్యాన్స్‌ క్లాస్‌ కోసం వేరే గదికి వెళ్లి విద్యార్థిని ఒక్కతే క్లాస్‌రూంలో ఉండటాన్ని అవకాశంగా తీసుకుని వానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్‌ రేప్, పోక్సో తదితర చట్టాల కింద కేసులను నమోదు చేశారు. బాలురను అదుపులోకి జువెనైల్‌ డిటెన్షన్‌ కేంద్రానికి తరలించారు.
చదవండి: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి..  

మరిన్ని వార్తలు