East Godavari: కాలువలోకి దూసుకెళ్లిన కారు..

3 Oct, 2021 21:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరగ్గానే కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు.

ప్రయాణికులకు మాత్రం స్వల్పగాయాలు అయ్యాయి. కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’

మరిన్ని వార్తలు