సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. 

8 Sep, 2023 07:30 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ​అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం

మరిన్ని వార్తలు