న్యూఢిల్లీ : ఓ ఫేస్బుక్ పోస్టుపై చేసిన కామెంటు పెద్ద గొడవకు దారి తీసింది. ఈ గొడవ కారణంగా నలుగురిపై తుపాకితో కాల్పులు జరిపాడో యువకుడు. ఈ సంఘటన న్యూఢిల్లీలోని నంగ్లోయ్లో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత శుక్రవారం నంగ్లోయ్కి చెందిన ఓ మైనర్ బాలుడు నిందితుడి ఫేస్బుక్ ఫ్రొఫైల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడు మైనర్ బాలుడు ఉన్న ప్రదేశానికి చేరుకుని గొడవ పెట్టుకున్నాడు. అతడ్ని చెంపదెబ్బ కొట్టాడు. ( మహిళా పోలీస్పై ఇన్స్పెక్టర్ అత్యాచారం)
ఈ నేపథ్యంలో మైనర్ స్నేహితుడు అడ్డురావటంతో నిందితుడు మరింత రెచ్చిపోయాడు. కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. అనంతరం తుపాకితో బాధితుల ఇంటికి వెళ్లి కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో నలుగురికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వీరిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.