Hyderabad: బాలికపై తండ్రి అత్యాచారయత్నం.. చిన్నారి కేకలు వేయడంతో..

26 Oct, 2021 09:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అబిడ్స్‌: మద్యం మత్తులో ఓ వ్యక్తి కూతురిపై లైంగికదాడికి యత్నించాడు.  ఈ సంఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవి తెలిపిన మేరకు.. ధూల్‌పేట గండి హనుమాన్‌ ప్రాంతంలో నర్సింగ్‌(30) కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యంతాగిన అతను.. 11 సంవత్సరాల కూతురిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింగ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఒకే ఇంట్లో వివాహిత, యువకుడి ఆత్మహత్యాయత్నం 

అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు 
మియాపూర్‌: మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి ఎల్బీనగర్‌ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మియాపూర్‌లోని హాఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న బి.ప్రసన్నకుమార్‌ (23) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 2018లో ఓ మైనర్‌ బాలిక పై లైంగిక దాడిచేశాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రసన్నకుమార్‌ పై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఎల్బీనగర్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం ప్రసన్నకుమార్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యామల వేంకటేష్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు