సాక్షి, బెంగళూరు : ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ప్రియున్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బెంగళూరు పరిధిలోని వర్తూరు సిద్దాపుర నివాసి పుష్పావతి(38), ఆమె ప్రియుడు మను (42) నిందితులు. హతుడు చంద్రశేఖర్(40). మైసూరుకు చెందిన చంద్రశేఖర్ బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. 15 ఏళ్ల క్రితం పుష్పావతితో పెళ్లయింది. చంద్రశేఖర్ 7 ఏళ్లు క్రితం కార్యాలయంలో ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు.
అప్పటి నుంచి మూర్ఛ వ్యాధి పీడిస్తోంది. గత నెల 21 తేదీన అత్త గాయత్రికి ఫోన్ చేసిన పుష్పావతి మీ కొడుకు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా కిందపడి గాయమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని తెలిపింది. పుష్పావతితో పొరుగింట్లో ఉండే మను సన్నిహితంగా ఉండడం చూసి చంద్రశేఖర్ బంధువుకు అనుమానం వచ్చి విచారించాడు. వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, లోతుగా దర్యాప్తు చేయడంతో తామిద్దరూ కలిసి తలపై రాడ్తో కొట్టి చంపినట్లు నిందితులు అంగీకరించారు.
చదవండి: అందరూ చూస్తుండగా ప్యాంటు విప్పి..
బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..