వికారాబాద్‌: ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న 

2 Jan, 2022 10:04 IST|Sakshi
గోవర్ధన్‌రెడ్డి(ఫైల్‌)

ఆస్తి కోసం దురాఘతం

వికారాబాద్‌లో ఘటన

సాక్షి, అనంతగిరి: వారసత్వంగా వస్తున్న ఆస్తికోసం తన సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన శనివారం తెల్లవారుజామున వికారాబాద్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ పట్టణం ఆలంపల్లికి చెందిన బండ అడివిరెడ్డికి ముగ్గురు కుమారులు అంజిరెడ్డి, రఘుపతిరెడ్డి, గోవర్ధన్‌ రెడ్డిలు ఉన్నారు. వీరిలో అంజిరెడ్డికి వివాహమై భార్యతో కలిసి విడిగా ఉంటున్నారు. రఘుపతిరెడ్డికి సైతం వివాహమైంది. చిన్నవాడైన గోవర్ధన్‌రెడ్డి(34)కి ఇంకా వివాహం కాలేదు. వీరంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసత్వంగా వస్తున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది.

ఆస్తి పంపకాల విషయంలో పలుమార్లు గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున అంజిరెడ్డి తన పక్క గదిలోనే నిద్రిస్తున్న చిన్న తమ్ముడు గోవర్ధన్‌రెడ్డి(34) నిద్రిస్తున్న రూంలోకి వెళ్లాడు. తమ్మునితో గొడవ పడి దారుణంగా హత్య చేశాడు. పెద్ద అరుపులు విన్న రఘుపతిరెడ్డి రూంలోకి వెళ్లి చూడగా అతనిపై సైతం దాడికి యత్నించాడు. దీంతో పెద్దగా అరవడంతో చుట్టు పక్కల వాళ్లు రావడంతో అక్కడి నుంచి అంజిరెడ్డి పారిపోయాడు. ఈ మేరకు రఘుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు