పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా.. పోలీసుల ఎంట్రీ

22 May, 2021 09:26 IST|Sakshi

నల్లగొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కర్ఫ్యూ అమలును ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు చేశారు. టూటౌన్‌ పరిధిలో 20మందికి మించి వివాహ రిసెప్షన్‌ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. రిసెప్షన్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని టూటౌన్‌ పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు.

చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
చదవండి: చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు

మరిన్ని వార్తలు