అగ్ని ప్రమాదం: 9 బస్సులు దగ్ధం

1 Mar, 2022 10:43 IST|Sakshi

ప్రకాశం జిల్లా: ఒంగోలు బైపాస్‌లోని ఉడ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్ధమయ్యాయి. పార్క్ చేసి ఉన్న ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది బస్సులు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు