Hyderabad Crime-Subhashini: భర్తతో విడాకులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య 

16 May, 2022 09:01 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌(గచ్చిబౌలి): మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్‌ తెలిపిన మేరకు.. జేవీజీ హిల్స్‌ ఉబేర్‌ హైట్స్‌ లో నివాసముండే అంకపల్లి సుభాషిణి(41) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. శనివారం రాత్రి ఫ్యాన్‌కు బెడ్‌ షీట్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

చాలా కాలం క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది. ఇంటర్‌ చదివే కుమారుడు గోవర్థన్‌ కౌశిక్‌తో కలిసి నివాసం ఉంటోంది. రెండు నెలలుగా ఫిట్స్‌తో బాధపడుతోంది. కారు, బైక్‌ నడపవద్దని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది. ఇటీవల కారు కొనుక్కున్న ఆమె కారు నడప వద్దని సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సుభాషిణి ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి.. నువ్వే లేకుంటే నేనెందుకని..)

మరిన్ని వార్తలు