వీడియో: ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఘోర ప్రమాదం

3 Jul, 2021 12:31 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్లున్న ఓ కారు రెండు లారీ కంటెనర్ల మధ్య చిక్కుకుంది. దీంతో అదుపు తప్పిన వేగంతో ఓ లారీ ముందున్న కారును ఘోరంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ కింద పడ్డ కారు నుజ్జునుజ్జు అయి మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

లారీ డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో లారీ కారుపైకి దూసుకురావటంతో ఈ ప్రమాదం చేటు చేసుకుంది. గురువారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం ఘటనలో మృతి చెందినవారిలో నాలుగేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు