ధనస్వామ్యం దండయాత్ర!

11 Sep, 2022 01:19 IST|Sakshi

మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్‌ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్‌ చెప్పారు. అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు.

ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్‌ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు.

అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్‌తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్‌ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు.

చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్‌ లేబర్‌ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్‌ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక  రంగాన్ని మార్కెట్‌ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు.

అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్‌ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్‌ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్‌ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి.

విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్‌ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్‌’ కంటెంట్‌ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్‌ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్‌ కంప్యూటర్‌లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్‌బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. 

ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్‌డీపి గ్రోత్‌ రేట్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్‌ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్‌ పూలింగ్‌కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్‌కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్‌ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్‌సైడర్‌ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను ఆయన ప్లాన్‌ చేశారు. ఈ వెంచర్‌పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్‌కు స్థిరపడిపోయింది.

మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్‌ ఎస్టేట్‌ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. 

ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ విజన్‌కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి.

ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్‌ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి.

‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్‌ విజన్‌కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్‌ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్‌ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్‌ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’

‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్‌ లేబర్‌ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్‌ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక  రంగాన్ని మార్కెట్‌ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్‌ వైఎస్‌ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు.
అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు