రేంజ్ ఐజీ పాలరాజు
నగరంపాలెం: గుంటూరు జిల్లాలో లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రేంజ్ ఐ.జి. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ జి.పాలరాజు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. టపా సులు విక్రయించే ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు పాటించకపోయిన వారి పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రేంజ్ ఐజీ ఆదేశించారు. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు గమనించాలన్నారు. జిల్లాలో బాణ సంచా విక్రయాల లైసెన్సు పొందిన దుకాణాల్లోనే ప్రభుత్వ నిబంధలనకు అనుగుణంగా బాణసంచా విక్రయించా లని తెలిపారు. అదే విధంగా బాణాసంచా లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతలప్రకారం దుకాణాలు నెలకొల్పలని అన్నారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక, అగ్నిమాపక సామగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు.