గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి తెలిపారు. శనివారం నగర శివారుల్లోని లాం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవటం సంతోషకరమన్నారు.