పెదకాకాని: కార్తికమాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయంలో పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు దంపతులు, గుంటూరు జిల్లా ఫస్ట్ అడిషినల్ జిల్లా జడ్జి సీహెచ్ రాజగోపాల్రావు దంపతులు, ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులకు అర్చకులు, వేద పండితుల స్వామివారి వేద ఆశీర్వచనం చేశారు. దేవస్థాన అధికారులు, పాలకమండలి చైర్మన్లు ప్రముఖులను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు అందజేశారు.