అమరేశ్వరాలయంలో కార్తిక సందడి | Sakshi
Sakshi News home page

అమరేశ్వరాలయంలో కార్తిక సందడి

Published Tue, Nov 21 2023 2:08 AM

-

అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం కార్తిక సోమవారం కిటకిటలాడింది. వేకువజా మునుండే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన పంచారామక్షేత్ర సందర్శన భక్తులు పూజలు చేశారు. పవిత్ర కృష్ణాజలాలలో కార్తిక స్నానాలు చేసి, ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద కార్తిక దీపారాధనలు చేసి కార్తిక దామోదరునికి విశేషపూజలు నిర్వహించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు శివపంచాక్షరీ నామంతో అమరేశ్వరాలయం ప్రతిధ్వనించింది. ఉదయం సుమారు 70 పైగా బస్సులలో పంచారామ క్షేత్రసందర్శన యాత్రికులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ కార్తిక సోమవారం విశిష్టతను వివరించారు. భక్తులకు ఏర్పాట్లను ఆలయ ఈఓ వేమూరి గోపినాథశర్మ పర్యవేక్షించారు. సుమారు 12 వేల మంది భక్తులు దర్శించుకున్నారని దేవాలయ అధికారుల అంచనా.

Advertisement
Advertisement