Viral Video: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్‌ సెక్రటరీ

6 Mar, 2023 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ మార్చి1న జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు జరిగిన సంగతి తెలిసింది. ఆ సదస్సు కోసం అని భారత పర్యటనకు వచ్చిన యూఎస్‌ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్‌ ఆటో రైడ్‌ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న స్థానిక సిబ్బంది సాయంతో సమీపంలోని ఓ స్థానిక ఆటోలో సరదాగా కాసేపు చక్కెర్లు కొట్టారు.

అందుకు సంబంధించని వీడియోని అమెరికా రాయబారి కార్యాలయం ఇది మా ప్రసిద్ధ ఆటోగ్యాంగ్‌ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. 

(చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్‌)

మరిన్ని వార్తలు