రోడ్డు ప్రమాదంలో మైనర్‌ బాలుడు..

18 Nov, 2023 01:34 IST|Sakshi

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఓ మైనర్‌ బాలుడు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణ ఎస్సై రాజేశ్‌ వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి మున్సిపల్‌ పరిధి కొత్తపల్లికి చెందిన అకుల సిద్ధార్థ(సిద్దు) అనే మైనర్‌ బాలుడు(15), పట్టణంలోని ఎంప్లాయీస్‌ కాలనీకి చెందిన ఎండీ గౌస్‌ ఇద్దరు కలిసి మోత్కులగూడెం నుంచి బైక్‌పై వస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై మినీ వ్యాన్‌(ట్రాలీ) బైక్‌ను ఢీకొట్టగా.. సిద్ధార్థ తలకు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ నడుపుతున్న ఎండీ గౌస్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి ఆకుల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు