మండ్య: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా అధికారి, జిల్లా ఎన్నికల అధికారి గోపాలకృష్ణ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండ్య, మద్దూరు, మళవళ్ళి, శ్రీరంగపట్టణం, పాండవపుర, కేఆర్ పేటె, నాగమంగళలోని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
మార్కెట్లలో పండుగ సందడి
మండ్య: నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకొని మండ్య నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. మండ్య నగరంలోని వివిధ మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని మార్కెట్ రోడ్డు, వీవీ రోడ్డు, పేటె వీధిలో మామిడి ఆకులు, పండ్లు, పూలు కొనుగోలు చేయడానికి నగర వాసులు భారీగా తరలివచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిక
చింతామణి: పట్టణంలోని 3వ వార్డు జేడీఎస్ కార్యకర్తలు ఆ ప్రాంత నేత సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని మాజీ ఎమ్మెల్యే సన్మానించారు.
నమో సిద్ధలింగేశ్వరా
కెలమంగలం: కెలమంగలం పట్టణ పంచాయతీలో శ్రీ సిద్దలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఫాల్గుణ మాస పూజలను నిర్వహించారు. స్వామి మూలవిరాట్ను అభిషేకించి వేద మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించారు. కెలమంగలం చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.