తల్లాడ: గత మూడు పర్యాయాలు నామినేషన్ దాఖ లుకు ముందు తల్లాడ మండలం అంజనాపురం అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయడాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే ఆనవాయితీగా కొనసాగించారు. ఈనేపథ్యాన గురువారం కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశాక ఆయన నామినేషన్ దాఖలుకు సత్తుపల్లి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావుతో పాటు డి.భద్రరాజు, వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దగ్గుల శ్రీనివాసరెడ్డి, రఘు, నరేష్రాజు తదితరులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీలు..
నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. మండలాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరా వడంతో రహదారులన్నీ కోలాహలం మారాయి.