అందరి నామినేషన్లలోనూ టీడీపీ జెండాలు
సత్తుపల్లిరూరల్: ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. సత్తుపల్లిలో గురువారం బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, డాక్టర్ మట్టా రాగమయి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కొందరు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీలో పాల్గొనడం కనిపించింది.