పక్షుల నుంచి పంటలను కాపాడుకునేందుకు దిష్టిబొమ్మలు, జెండాలను రైతులు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే! ఇప్పుడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండడంతో వివిధ పార్టీల నాయకులు ఎక్కడపడితే అక్కడ జెండాలను కడుతున్నారు. దీంతో ఇల్లెందు మండలం పోచారంతండా గ్రామానికి చెందిన రైతు వినూత్నంగా ఆలోచించాడు. గ్రామంలో ఎగురుతున్న పార్టీల జెండాలను తన మిర్చి చేనులో ఏర్పాటుచేశాడు. ఏదో ఒక పార్టీ జెండా ఏర్పాటుచేస్తే ఆ పార్టీ అనుచరుడిగా ముద్ర వేస్తారని అనుకున్నాడో ఏమో కానీ అందరూ సమానమేనని చాటేలా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ప్రజాపంథా పార్టీ జెండాలను కూడా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది.