పోలింగ్‌ ఉద్యోగులకు ‘ఆరోగ్య’ కిట్లు

17 Nov, 2023 00:16 IST|Sakshi
ఉద్యోగులకు ఇవ్వనున్న మందుల కిట్లు

ఖమ్మం వైద్యవిభా గం: ఈనెల 30న జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ కిట్లు అందించనుంది. కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఆదేశాల మేరకు తొలిసారిగా ఉద్యోగుల కోసం 1,500కిట్లు సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు ఒకరోజు ముందుగానే వెళ్లే వారికి అనారోగ్య సమస్యలు ఎదురైతే ఉపయోగపడేలా మందులతో కిట్‌ తయారుచేశారు. ఇందులో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు, ఇతర సమస్యల నివారణకు ఉపయోగపడే మందులే కాక దూది ఉంటాయి.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించారు. ఆతర్వాత నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు