వివాహేతర సంబంధమే కార‌ణ‌మా..?

10 Dec, 2023 08:22 IST|Sakshi

పోలీసుల అదుపులో నిందితులు..

మహబూబ్‌నగర్‌: జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్‌ గురువారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చేధించినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఓ మహిళతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చిందని, త్వరలోనే నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ రమేశ్‌బాబు తెలిపారు.
ఇవి చ‌ద‌వండి: కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్లు అరెస్ట్‌
 

>
మరిన్ని వార్తలు