దుర్గమ్మకు పూజలు

14 Nov, 2023 04:28 IST|Sakshi
అమ్మవారిని దర్శించుకుంటున్న హైకోర్టు ఉప లోకాయుక్త జడ్జి నిరంజనరావు దంపతులు

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైకోర్టు ఉప లోకాయుక్త జడ్జి నిరంజనరావు దంపతులు, సంగారెడ్డి జిల్లా ఎలక్షన్‌ అబ్జర్వర్‌, లక్నో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఏడుపాయల ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు, పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు