ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు..

14 Nov, 2023 04:28 IST|Sakshi
ఎన్నికల అబ్జర్వర్‌కు స్వాగతం పలుకుతున్న రాజర్షిషా, రోహిణీప్రియదర్శిని

మెదక్‌ కలెక్టరేట్‌: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల జిల్లా పరిశీలకుడు పృధ్వీరాజ్‌ ఆదివారం మెదక్‌ రావడంతో కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీరోహిణీ ప్రియదర్శిని పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సోమవారం ఆయన నర్సాపూర్‌, మెదక్‌ ఆర్‌ఓ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలకు పరిశీలకులను సంప్రదించాలని కలెక్టర్‌ రాజర్షిషా ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు (89696 98906, 08452 223010) ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పృధ్వీరాజ్‌ మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారని అన్నారు.

మెదక్‌లోనే ఎన్నికల అబ్జర్వర్‌ పృధ్వీరాజ్‌

సందేహాలు ఉంటే సంప్రదించండి : కలెక్టర్‌ రాజర్షి షా

మరిన్ని వార్తలు