ఓటర్‌ స్లిప్‌, గైడ్‌ ను అందజేయాలి

16 Nov, 2023 07:10 IST|Sakshi

హవేళిఘణాపూర్‌(మెదక్‌): సాధారణ ఎన్నికల్లో భాగంగా బుధవారం హవేళిఘణాపూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్‌ ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. ఓటర్‌ స్లిప్‌ తోపాటు ఓటర్‌ గైడ్‌, సీ విజిల్‌ కరపత్రాలు ప్రతి ఓటర్‌కు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా పారదర్శకంగా ఓటు వేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరు సీ విజిల్‌ యాప్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950పై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఆర్‌ఓ, ఆర్డీఓ అంబాదాస్‌, రాజేశ్వర్‌, ఏఆర్‌ఓ నారాయణ ఎన్నికల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృథ్వీరాజ్‌

మరిన్ని వార్తలు