ముంబై: సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు విశాల్ ఆనంద్ ఆదివారం( అక్టోబర్ 4) కన్ను మూశారు. 1976లో వచ్చిన 'చల్తే చల్తే' చిత్రంతో విశాల్ ఆనంద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు భీష్మం కోహ్లీ. విశాల్ ఆనంద్ 11 హిందీ చిత్రాలలో నటించారు. వాటిలో చాలా 'చల్తే చల్తే', 'టాక్సీ డ్రైవర్' (1973) సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. నటుడిగా కాకుండా, నిర్మాతగా విశాల్ ఆనంద్ పలు చిత్రాలు నిర్మించారు. అంతే కాకుండా కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
'చల్తే చల్తే' లో విశాల్ ఆనంద్ సిమి గరేవాల్, నజ్నీన్, శ్రీరామ్ లగూలతో కలిసి నటించారు. దీనికి సుందర్ దార్ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మించారు. నటుడు పురబ్ కోహ్లీ, విశాల్ ఆనంద్కు మేనల్లుడు అవుతారు. చదవండి: ఆటవస్తువు గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి