Akkeneni Family: మరో మల్టీస్టారర్‌లో నాగ్‌.. అప్పుడు చైతూ, ఇప్పుడు అఖిల్‌!

27 Feb, 2022 14:03 IST|Sakshi

మంచి కథ దొరికితే చాలు అక్కినేని హీరోలు మల్టీస్టారర్  కు జై కొడతారు.ఇప్పటికే మనం లాంటి క్లాసిక్ మూవీని టాలీవుడ్ కు అందించారు. ఈ సంక్రాంతికి బంగార్రాజుతో మరోసారి అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ అందించింది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఇంకో మల్టీస్టారర్ కు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారట.మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇప్పటికిప్పుడు ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకివెళ్లే అవకాశలు లేవు. అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ,నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు. మరోవైపు బంగార్రాజుకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్‌ నాగచైతన్య, అఖిల్‌తో కలిసి నాగార్జున నటించనున్నాడు. మొత్తానికి అక్కినేని హీరోల మల్టీస్టారర్స్ లిస్ట్  పెరుగుతుందన్నమాట.

మరిన్ని వార్తలు