Minister Vellampalli: ‘ఫ్లాప్‌ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్‌’

27 Feb, 2022 14:08 IST|Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: భీమ్లా నాయక్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని.. వైఫల్యాన్ని ప్రభుత్వంపై రుద్దేందుకే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ డ్రామాలాడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్లాక్‌ టికెట్లు అమ్ముకుని కొంతైనా బయటపడాలని చూస్తున్నారన్నారు. అఖండ సినిమా టైంలో ఉన్న జీవోనే ఇప్పటికీ అమల్లో ఉందన్నారు. ఫ్లాప్‌ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్‌ చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.
చదవండి: అలాంటి వ్యక్తిని సొంత తమ్ముడే అవమానిస్తాడా?’

మరిన్ని వార్తలు