మైసూర్‌లో నా సామిరంగ

6 Nov, 2023 00:10 IST|Sakshi

హీరో నాగార్జున కొన్ని రోజులు మైసూర్‌కు మకాం మార్చారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్  ఫిల్మ్‌ ‘నా సామిరంగ’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మైసూర్‌లో ప్రారంభమైందని సమాచారం.

నాగార్జున, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్లాన్  చేశారు. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్  హీరోయిన్స్ గా యాక్ట్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు