బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రెండు భాగాలుగా ‘పుష్ప’, కారణ ఇదేనట

12 May, 2021 10:39 IST|Sakshi

Allu Arjun Pushpa: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయింది. మరోవైపు హీరో అల్లు అర్జున్‌ కరోనా బారిన పడడంతో ఆయన ప్రస్తుతం ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే.. ‘పుష్ప’గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. సుకుమార్‌ ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు దీనిపై రియాక్ట్ అవుతూ పుష్ప సినిమా రెండు భాగాలుగా వస్తుందనే వార్త నిజమే అని అన్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికర అంశంగా మారింది. . ఎంతో స్పాన్‌ ఉన్న ఈ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్‌, సుకుమార్‌గారితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇందులో బన్నీబన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. రష్మికా మందన్న హీరోయిన్‌. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు