Deeksha Seth: వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి?

21 Jul, 2022 17:22 IST|Sakshi

దీక్షా సేత్‌.. ఈ పేరు చెప్తే గుర్తుపడతారో లేదో కానీ వేదం, నిప్పు, మిరపకాయ్‌, వాంటెడ్‌ సినిమాల హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టిందీ బ్యూటీ. హైదరాబాద్‌లో ఓ మోడలింగ్‌ అసైన్‌మెంట్‌ కోసం పని చేస్తున్న సమయంలో డైరెక్టర్‌ క్రిష్‌ కంట పడింది దీక్ష. వెంటనే ఆమెను వేదం సినిమాలో కేబుల్‌ రాజు(అల్లు అర్జున్‌) గర్ల్‌ఫ్రెండ్‌ రోల్‌ కోసం తీసుకున్నారు. ఆ సినిమా క్లిక్‌ అవ్వడంతో వెంటనే ఆమె మరో రెండు సినిమాలకు సంతకం చేసింది.  అందులో మిరపకాయ్‌ బాక్సాఫీస్‌ దగ్గర బాగానే ఆడింది, కానీ అందులో దీక్షా సేత్‌ సైడ్‌ హీరోయిన్‌. ఇక గోపీచంద్‌తో చేసిన వాంటెడ్‌లో తొలిసారి కథానాయికగా నటించింది.

కానీ ఆమె అంచనాలు తలకిందులు చేస్తూ వాంటెడ్‌ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచిపోయింది. అలా ఆమె హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె నెమ్మదిగా టాలీవుడ్‌కు దూరమైపోయింది. ఆమె చివరగా తెలుగులో రెబల్‌(2012)లో, హిందీలో సాత్‌ కడమ్‌ (2016)లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించకుండా పోయిన ఈ హీరోయిన్‌ సోషల్‌ మీడియాకు కూడా నెలల తరబడి దూరంగా ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే తన ఫొటోలను పంచుకునేది. ఈ క్రమంలో దీక్ష తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తోందీ హీరోయిన్‌. ఈ పోస్ట్‌ చూసిన సందీప్‌ కిషన్‌ 'సేత్‌ మళ్లీ వచ్చేసిందోచ్‌' అంటూ కామెంట్‌ చేశాడు. కొందరు మాత్రం దీక్ష ఇలా అయిపోయిదేంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్‌.

A post shared by Deeksha Seth (@deeksha721)

A post shared by Deeksha Seth (@deeksha721)

చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో!
ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్‌ కుమార్‌

మరిన్ని వార్తలు